Tamil Nadu : పెరియార్ విగ్రహంపై చెప్పుల దండ
కోయంబత్తూరులోని వెల్లలూరులో సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి విగ్రహం ఆదివారం అపవిత్రానికి గురైంది. పెరియార్ స్టడీ సెంటర్ ముందున్న విగ్రహానికి చెప్పుల దండ వేశారు.
- kunduru Vinod
- Published On : January 9, 2022 / 09:12 PM IST
Tamil Nadu
Tamil Nadu : కోయంబత్తూరులోని వెల్లలూరులో సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి విగ్రహం ఆదివారం అపవిత్రానికి గురైంది. పెరియార్ స్టడీ సెంటర్ ముందున్న విగ్రహానికి చెప్పుల దండ వేసి తలపై కుంకుమపువ్వు పొడిని చల్లారు. దీనిని గమనించిన స్థానికులు విషయాన్నీ ద్రవిడర్ కజగం నేతలకు తెలపడంతో వారు ఆందోళనకు దిగారు. అనంతరం పోదనూరు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో మెడలోని చెప్పుల దండను తొలగించి.. కుంకుమను శుభ్రం చేశారు. ఒకే డీకే నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీకే నేతలకు పోలీసులు తెలిపారు.
Also Read : Tamilnadu Encounter : ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీ షీటర్లు మృతి
