గత నెలలో 80గంటల పాటు మహారాష్ట్రలో జరిగిన రాజకీయ హైడ్రామాపై ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక విషయాలు వెల్లడించారు.ఆదివారం ముంబైలో ఓ మీడియా సంస్థలకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫడ్నవిస్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎన్నికల తరువాత అజిత్ పవార్ ను తాము సంప్రదించామనేది అవాస్తవమని ఫడ్నవీస్ అన్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు తాము అజిత్ పవార్ను ఏమాత్రం సంప్రదించలేదన్నారు. తాము ఎమ్మెల్యేల కొనుగోలుకు, పార్టీ చీల్చివేతకు పాల్పడలేదని, అజిత్ పవారే తొలుత తమ దగ్గరకు వచ్చి.. తనతో పాటు మిగిలిన ఎన్సీపీ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్-శివసేనతో ప్రభుత్వం ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని,బీజేపీకి మద్దతిచ్చేందుకు తాము రెడీగా ఉన్నామని తనను ఒప్పించినట్లు ఫడ్నవిస్ తెలిపారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు చెప్పే తాను ఇదంతా చేస్తున్నానని కూడా అజిత్ తనతో చెప్పినట్లు పడ్నవీస్ తెలిపారు. అయితే అప్పుడున్న పరిస్థితిల్లో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా శరద్ చక్రం తిప్పారని, అజిత్ డ్రామా వెనుక ఆయన హస్తం ఉందని ఫడ్నవిస్ అన్నారు. ఆయనతో కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆ క్రమంలోనే ప్రమాణ స్వీకారం కూడా చేశాం.
కానీ ఏమైందో ఏమో తెలీదు 24 గంటల్లోనే అజిత్ మాట మార్చారు. తనేమీ చేయలేనని చేతులెత్తేశారు. ఇదంతా శరద్ పవార్ అడిన రాజకీయ నాటకంగా తర్వతా మాకు అర్థమవుతోంది. ప్రధాని మోడీతో భేటీ సమయంలో కలిసి పనిచేద్ధాం అని శరద్ను తొలుత ఆహ్వానించాం. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ భేటీ గురించి శరద్ అయనకు అనుకూలమైన కొన్ని విషయాలను మాత్రమే బహిర్గతం చేశారు. ఆయన చెప్పాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడే నేనే వాటిని బయటపెడతా. శివసేన కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే ఎన్సీపీ, కాంగ్రెస్తో భేరాలకు దిగిందని ఫడ్నవీస్ అన్నారు.