Ajmer Dargah Aadil Chishti Insults Hindus Over ‘animal Gods’
Ajmer Dargah Aadil Chishti insults Hindus over ‘animal Gods’ : హిందూ దేవుళ్లపై ఇటీవల వివాదాలు ఎక్కువైపోయాయి. సిగిరెట్ కాలుస్తున్న కాళీ..శివుడు ఎంతటి వివాదాన్ని రేపాయో తెలిసిందే. ఈ క్రమంలో హిందూ దేవతలను అసహాస్యం చేస్తూ.. అజ్మీర్లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా అంజుమన్ కమిటీ కార్యదర్శి సయ్యద్ సర్వర్ చిస్తీ కుమారుడు అదిల్ చిస్తీ చేసిన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువులకు 333 కోట్లమంది దేవుళ్లు ఎలా ఉంటారు? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన అదిల్ పైగా వారిలో కొంతమంది దేవతలు సగం జంతువు..సగం మనుషుల్లా ఉంటారు అదసలు సాధ్యమేనా? అంటూ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించారు.
అంతేకాదు..‘సగం మనిషి, సగం జంతువులా ఉండే వినాయకుడు, హనుమంతుడు కూడా దేవుళ్లేనా? అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర వివాదంగా మారింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్లో ఫిర్యాదు నమోదైంది. అదిల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.తన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో అదిల్ స్పందించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని అన్నారు. నుపుర్ శర్మను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశానంటూ మరో వీడియోను విడుదల చేశారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలు అయినా గాయపడి ఉంటే తనను క్షమించాలని కోరారు.
అదిల్ వ్యాఖ్యలు..
ఆదిల్ చిస్తీ ఈ వీడియోలో మాట్లాడుతూ.. “నూపుర్ శర్మ హిందువు అయితే..ఆమె కోసం నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాఅంటూ.. 333 బిలియన్ల దేవుళ్ళు ఉన్నారని ఎలా అంగీకరించాలి? ఇది ఎలా సమంజసం? మన మతాలు ఎలా ఉన్నా మనుషులుగా మనమంతా సమానమే. మేము భగవంతుని ఉనికిని..అత్యున్నతమైన దేవత ఉనికిని గట్టిగా నమ్ముతాము. వివిధ మతాల ప్రజలు ఒకే విషయానికి భిన్నమైన వివరణలు కలిగి ఉండవచ్చు. అయితే 333 కోట్ల దేవుళ్లను, దేవుళ్ల సంఖ్యను ఎలా నమ్మాలి? 333 కోట్ల మంది దేవతలను ఎవరూ సంతోషపెట్టలేరని నేను నమ్ముతున్నాను అన్నారు.
“రెండవది, హిందూ పురాణాలలో కూడా విష్ణువు యొక్క 10 అవతారాల ప్రస్తావన ఉందని నేను నూపుర్ శర్మకు గుర్తు చేయాలనుకుంటున్నాను” అంటూ ఆదిల్ దేవుళ్లలో కొంత భాగం జంతువుగా..మరి కొంత భాగం మనిషిగా ఉంటాయి. వీరు కూడా దేవుళ్లేనా? అంటూ ప్రశ్నించారు.ఇంకా దశావతారాల గురించి అదిల్ మాట్లాడుతూ..10 అవతార్లు నమ్మదగినవిగా నుపుర్ శర్మ భావిస్తున్నారా? అని ప్రశ్నించారు.దేవుడు ఒక్కడే అని మీరు వాదిస్తారు..కానీ అతని 10 వేర్వేరు అవతారాలు అని మీరే అంటారు. కొందరు మనుషులుగా, మరికొందరు జంతువులుగా కనిపిస్తారు..మరికొందరు హైబ్రిడ్ రూపంలో ఉంటారు వీరిని మీరు నమ్ముతున్నారా? అని ప్రశ్నించారు.వినాయకుడు..హనుమంతుడు దేవుళ్లని ఎలా నమ్ముతారు? వారికి మానవ రూపం లేకపోయినా, మీరు వారిని దేవుళ్లుగా గౌరవిస్తారు. కానీ ఎదుటివారి దైవాలను మాత్రం విమర్శిస్తారు? ఇవి ఎంతవరకు సమంజసం? అంటూ జూన్ 23, 2022న ఆదిల్ చిస్తీ ప్రశ్నించారు.
అజ్మీర్ దర్గాకు చెందిన చిస్తీలు ఇటీవల తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆదిల్ చిస్తీ తండ్రి సర్వర్ చిస్తీ..భారతదేశంలో హింసాత్మక ఉద్యమం జరుగుతుందని..ఇది మొత్తం హిందుస్థాన్ దేశాన్ని కదిలిస్తుంది అని గతంలో వ్యాఖ్యానించారు.హిందువుల ఆధ్వర్యంలోనే వ్యాపారాలను బహిష్కరించాలని కూడా సర్వర్ చిస్తీ డిమాండ్ చేసారు. సర్వర్ చిస్తీ మేనల్లుడు గౌహర్ చిస్తీ ప్రవక్త ముహమ్మద్ను అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తల నరికివేయాలని డిమాండ్ చేశాడు. అలాగే కన్హయ్య లాల్ హంతకులను గౌహర్ చిస్తీ కలుసుకున్నారు. నూపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ను షేర్ చేసినందుకు, ఉదయపూర్లో కన్హయ్య లాల్ హత్యకు గురి అయిన విషయం తెలిసిందే. హిందూమతంలో 333 కోట్ల మంది దేవతలు ఉన్నారని ఆదిల్ చిస్తీ చెప్పినది వాస్తవం కాదు..”కోటి” అనే పదానికి “కోటి” అనే అర్థం కూడా ఉంది కాబట్టి..యూరోపియన్లు దానిని “33 కోట్లు” అని తప్పుగా అనువదించారు. అప్పటి నుండి ఈ లోపం ప్రపంచమంతటా వ్యాపించింది. ఆదిల్ చిస్తీ మాత్రం నేడు 333 కోట్లు అంటూ వక్రీకరించింది.
హిందూ శాస్త్రం ప్రకారం ముక్కోటి దేవతల వివరణ..
హిందూ శాస్త్రం ప్రకారం ముక్కోటి దేవతలు.. 33 కోట్ల దేవతలు అని చెబుతూ ఉంటారు. అసలు వేదంలో చెప్పింది మాత్రం 33 మంది దేవతలు..అస్టౌవ్ వశవహ.. ద్వాదశ దిత్యాః..ఏకాదశ రుద్రాహ.. దో అశ్విని నౌచాహ.. అని వేదం చెప్పింది.అస్టౌవ్ వశవహ – ఎనిమిదిమంది వసువులు..ద్వాదశ దిత్యాః -12 మంది ఆదిత్యులు,ఏకాదశ రుద్రాహ.. 11 మంది రుద్రులు..దో అశ్విని నౌచాహ -ఇద్దరూ అశ్వినీ దేవతలు.. మొత్తం కలుపుకుంటే 33 మంది దేవతలు.. ఇక సంస్కృతంలో కోటి అనగా.. వర్గము, విధము అని అర్థము ఇది సంఖ్యను సూచించే కోటి కాదు. ఈ 33 మంది దేవతలు ఒక్క గోమాత లోనే ఇమిడి ఉంటారు అని , గోమాతను హిందువులు అత్యంత పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. ఇటీవల కేంద్రం కూడా గోమాతను జాతీయ జంతువుగా భావించాలని సూచిస్తోంది..
కొంతమంది హేతువాదులు 33 కోట్ల మంది దేవతలు.. ముక్కోటి మంది దేవతలు అని అంటారు కదా..! వీరంతా ఎక్కడున్నారు.. ఎక్కడి నుంచి వచ్చారు ..అని అంటున్నారు. నిజానికి మన హిందూ సంప్రదాయంలో గొప్ప విషయం ఏమిటంటే , హిందువులు ప్రతి ఒక్క విషయాన్ని దైవ స్వభావంతో భావిస్తారు. అలాగే ప్రతి పరమాణును కూడా దైవంగా భావిస్తారు కాబట్టి, హిందువుల ప్రకారం 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని చెబుతారు. భక్తులు ఎలా ఉన్నారు అంటే పుట్ట కనిపించినా, చెట్టు కనిపించిన అలాగే గుట్ట కనిపించినా కూడా దైవంగా భావించి పూజిస్తూ ఉంటారు కాబట్టే ముక్కోటి దేవతలు ఉన్నారు అని భక్తులు నమ్ముతారు..