Tamil Nadu: తమిళనాడులో ఘోర ప్రమాదం.. రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లో గ్యాస్ లీక్.. ఏడుగురు మృతి

తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పెరియపాలెం సమీపంలో భారీ విషాదం చోటుచేసుకుంది.

Ammonia gas leak at a shrimp processing plant in Tamil Nadu seven workers died on the spot

  • రొయ్యల ప్లాంట్లో గ్యాస్ లీక్.
  • విషవాయువు పీల్చి ఏడుగురు మృతి.
  • అరవై మందికి పైగా తీవ్ర అస్వస్థత.

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పెరియపాలెం సమీపంలో భారీ విషాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ఒక రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లో ప్రమాదవశాత్తు అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఈ రసాయన వాయువు వేగంగా వ్యాపించడంతో ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్యాస్ పీల్చిన వారిలో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.

GO 45: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 95 శాతం పోస్టులు స్థానికులకే.. జీవో 45 జారీ

ఈ ప్రమాదం కారణంగా సుమారు 60 మందికి పైగా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లీకైన అమ్మోనియా గ్యాస్ ప్రభావం వల్ల బాధితులంతా శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారు. అంతేకాకుండా తీవ్రమైన తల తిరగడం, కంటి మంటలు మరియు వాంతులు వంటి లక్షణాలతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.(Tamil Nadu) అస్వస్థతకు గురైన బాధితులందరినీ వెంటనే చికిత్స నిమిత్తం పెరియపాలెం, తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ప్లాంట్లో గ్యాస్ లీకేజీకి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.