Video: లోకల్ ట్రైన్‌లో గానామృతధారలు కురిపించిన ప్రయాణికుడు

రద్దీగా ఉన్న ముంబై లోకల్ ట్రైన్‌లో అందరూ చమటలు కక్కుతూ చిరాకుతో ఉన్న సమయంలో..

ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణించిన కొందరు ప్రయాణికులు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని సొంతం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడు ట్రైన్‌లో 1997లో హిట్ అయిన సోనూ నిగమ్ సాంగ్ ‘యే దిల్ దీవానా’ ను పాడాడు. అతడి గానానికి ప్రయాణికులంతా మైమరచిపోయారు.

రద్దీగా ఉన్న ముంబై లోకల్ ట్రైన్‌లో అందరూ చమటలు కక్కుతూ చిరాకుతో ఉన్న సమయంలో బ్లూకలర్ చొక్కాలోని ఓ ప్రయాణికుడు పాట పాడాడు. దీంతో ఇతర ప్రయాణికులు కూడా అతడితో రాగం కలిపారు. ఒక వ్యక్తి రైలును కొడుతూ తబలా వాయిద్యంలా మోగించాడు. ఈ వీడియోను ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.

కళ ప్రతిచోటా ఉంటుందనే క్యాప్షన్‌తో అతడు షేర్ చేశాడు. మూడు రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకు 90 లక్షలకు పైగా వ్యూస్ దక్కాయి. నటుడు-గాయకుడు సుశాంత్ దివ్‌గిక్ర్ కూడా ఈ వీడియోపై స్పందించారు. తోటి ప్రయాణికులను గానంతో అలరించారని పేర్కొన్నారు. ట్రైనులో ప్రయాణికుడు పాడిన పాట అద్భుతంగా ఉందని, తోటి ప్రయాణికులనూ గాన సముద్రంలో ముంచెత్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: ఇది కదా సక్సెస్ అంటే.. ఆనందంతో అమ్మ కళ్లలో కన్నీళ్లు.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు