రెడ్ హ్యాండెడ్‌గా భార్య, ఆమె ప్రియుడిని పట్టుకున్న భర్త.. చివరికి వారిద్దరికీ పెళ్లి చేసి.. 

అర్ధరాత్రి వేళ పని అయిపోవడంతో రాజేశ్ కుమార్ ఇంటికి వచ్చాడు. తన భార్య, ఆమె ప్రియుడితో..

తన భార్య పరాయి మగాడిని చూస్తేనే ఆమెపై భర్త దాడికి దిగడం, విడాకులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్న రోజులు ఇవి. అటువంటిది తన భార్య తనను మోసం చేస్తూ, తన కళ్లుగప్పి ఆమె ప్రియుడితో ఉండడాన్ని గుర్తించినప్పటికీ ఓ భర్త గొప్ప మనసు చాటుకున్నాడు. ఆమె ఎక్కడ ఉన్నా సుఖసంతోషాలతో ఉండాలని, ఆమెను విడిచి వెళ్లాడు.

తన భార్యకు ఆమె ప్రియుడితో దగ్గరుండి పెళ్లి చేసి పంపాడు. బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లా రామ్‌నగర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 26 ఏళ్ల రాజేశ్ కుమార్ అనే వ్యక్తి దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. తన భార్య, ఆమె ప్రియుడు ప్రేమాయణం కొనసాగిస్తుండడంతో వారి వివాహానికి తాను అంగీకరించినట్లు చెప్పారు.

రాజేశ్ కుమార్ భార్య పేరు ఖుష్బూ కుమారి (22). రాజేశ్ కుమార్‌, ఖుష్బూ వివాహం 2021లో జరిగింది. వారి అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లి కాక ముందే చందన్ కుమార్ (24) అనే వ్యక్తితో ఖుష్బూ ప్రేమాయణం కొనసాగించింది. రాజేశ్‌తో పెళ్లి జరిగినప్పటికీ చందన్‌ను కలుస్తూనే ఉంది. ఇటీవల రాత్రి ఇంట్లో ఎవరూ లేని వేళ ఖుష్బూను కలిసేందుకు చందన్ కుమార్ వచ్చాడు.

అర్ధరాత్రి వేళ పని అయిపోవడంతో రాజేశ్ కుమార్ ఇంటికి వచ్చాడు. తన భార్య, ఆమె ప్రియుడితో కొనసాగిస్తున్న వ్యవహారాన్ని గుర్తించాడు. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో వారి సంబంధం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాతి రోజే చందన్, ఖుష్బూను తీసుకుని గ్రామ పెద్దల వద్దకు వెళ్లాడు రాజేశ్. తన భార్యకు, ఆమె ప్రియుడికి పెళ్లి చేస్తానని చెప్పాడు. తన రెండేళ్ల కుమారుడిని మాత్రం తన వద్దే పెంచుతానని తెలిపాడు. తన భార్య, చందన్ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. తన భార్యకు, ఆమె ప్రియుడికి పెళ్లి చేసి పంపి, తన దారి తాను చూసుకున్నాడు రాజేశ్.

Also Read: వయనాడ్ ఘటన.. కన్నీరు పెట్టిస్తున్న కుక్క వీడియో 

ట్రెండింగ్ వార్తలు