BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం

ప్రధానంగా ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ పాలన ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణపై బ్లూ ప్రింట్‌ సిద్దం చేశారు.

BJP Supremacy: దేశ వ్యాప్తంగా రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాతీయ పార్టీలు వేగంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ..కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమీక్షలు జరిపి..పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధ చేస్తుండగా..అధికార బీజేపీ సైతం వేగంగా ఆదిశగా అడుగులు వేస్తుంది. ఈమేరకు బుధవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరిగిన ఈ సమావేశంలో నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. వీటిలో ప్రధానంగా ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ పాలన ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణపై బ్లూ ప్రింట్‌ సిద్దం చేశారు.

Other Stories:Modi in Hyderabad: ప్ర‌ధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు

2019 ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ఓటమి పొంది..రెండు, మూడు స్థానాలకు పరిమితమైన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. అందులో భాగంగా 144 లోకసభ స్థానాలను గుర్తించి..అక్కడ కేంద్ర మంత్రులు పర్యటించి పలు కార్యక్రమాలు చేపట్టాని నిర్ణయం తీసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పర్యటనల్లో భాగంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి.. గడిచిన ఎనిమిదేళ్ళలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను కేంద్ర మంత్రులు ప్రజలకు వివరించనున్నారు. 144 లోకసభ స్థానాల్లో..ఒక్కో కేంద్ర మంత్రి ఒక్కొక్క లోక్‌సభ స్థానంలో మూడు రోజుల పాటు పర్యటించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది.

Other Stories:Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ

ట్రెండింగ్ వార్తలు