ఎన్నికల వేళ ఆ 370తో ఈ 370కి ముడిపెడుతూ మోదీ ఆసక్తికర కామెంట్స్

ఇవాళ ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో మోదీ పాల్గొని ప్రసంగించారు.

Modi

Narendra Modi: ‘బీజేపీ 370 లోక్‌సభ సీట్లు గెలిస్తే.. అదే ఆర్టికల్ 370 రద్దుకోసం పోరాడిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇవాళ ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో మోదీ పాల్గొని ప్రసంగించారు.

పార్టీ ఎన్నికల చిహ్నం కమలమే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిలాంటిదని మోదీ వ్యాఖ్యానించారు. దాన్ని గెలిపించే బాధ్యతను ఆఫీస్ బేరర్లు తీసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. కాగా, ఒంటరిగా 370 సీట్లు గెలవాలని, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి 400కు పైగా సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్వేల ఫలితాలు కూడా మోదీకి అనుకూలంగా వస్తుండడంతో బీజేపీ మరింత ఖుషీగా ఉంది. ఎన్నికలకు బీజేపీ నేతలు, కార్యకర్తలను సిద్ధం చేయడానికి ఆ పార్టీ అధిష్ఠానం సమావేశాలు నిర్వహిస్తోంది.

మోదీ ప్రసంగంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు అనవసరమైన, భావోద్వేగభరిత సమస్యలను లేవనెత్తుతాయని చెప్పారని తెలిపారు. అయితే దేశ అభివృద్ధి కార్యక్రమాలు, పేదలకు అందించిన సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు పార్టీ నేతలు వివరించి చెప్పాలని కోరారు.

కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా మారింది.. ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డగోలుగా అవినీతి : మంత్రి ఉత్తమ్

ట్రెండింగ్ వార్తలు