Chhattisgarh : అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 364 కిలోల డ్రగ్స్ స్వాధీనం

ఒడిశా నుండి నిషేధిత వస్తువులను సేకరించి బలోడా బజార్‌కు తీసుకెళ్తున్నట్లు పట్టుబడిన నిందితుడు విచారణలో వెల్లడించినట్లు అధికారి తెలిపారు. కేసున నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు.

Drugs Seize

Chhattisgarh Police Seized Drugs : ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 364 కిలోల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబులెన్స్‌లో గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై రాయ్‌పూర్ పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. రాయ్‌పూర్‌లో అంబులెన్స్ లో నుండి 364 కిలోగ్రాముల నిషేధిత గంజాయి (సైకోట్రోపిక్ డ్రగ్స్) స్వాధీనం చేసుకున్నారు.

బుధవారం అర్ధరాత్రి పోలీసు బృందం అనుమానాస్పద స్థితిలో అంబులెన్స్‌ను అడ్డగించి తనిఖీ చేసినట్లు ఆజాద్ చౌక్ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మయాంక్ గుర్జార్ తెలిపారు. అంబులెన్స్‌ నుండి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆమనక పోలీస్ స్టేషన్ పరిధిలో అంబులెన్స్‌ను అడ్డగించి తనిఖీ చేసినట్లు వెల్లడించారు.

Pallavi Prashanth: బిగ్‌బాస్ విజేత పల్లవి ప్ర‌శాంత్‌కు బిగ్ షాక్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

పోలీసు బృందం అంబులెన్స్ నుండి 364 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న నిషేధిత గంజాయి విలువ సుమారు రూ.36 లక్షలు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. అరెస్టైన నిందితుడిని సారన్‌గఢ్-బిలాయిగఢ్ జిల్లాకు చెందిన సూరజ్ ఖుటే (22)గా గుర్తించి, సీఎస్పీకి సమాచారం అందించారు.

ఒడిశా నుండి నిషేధిత వస్తువులను సేకరించి బలోడా బజార్‌కు తీసుకెళ్తున్నట్లు పట్టుబడిన నిందితుడు విచారణలో వెల్లడించినట్లు అధికారి తెలిపారు. కేసున నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు.