CM Mamata Banerjee blames BJP : పశ్చిమ బెంగాల్ లో హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు బీజేపీనే కారణమని ఆరోపించారు. బీజేపీ గెలిచిన చోటనే హింస చెలరేగిందని ఫైర్ అయ్యారు.
బీజేపీ సోషల్ మీడియాలో ఫేక్ వీడియో షేర్ చేసిందన్నారు. వీడియో షేర్ చేసినవాళ్లను గుర్తించామని చెప్పారు. బెంగాల్ లో హింసను చల్లార్చాలని డీజీపీ, ఎస్పీలకు మమతా ఆదేశాలు జారీ చేశారు.
బెంగాల్ లో శాంతి, సామరస్యాలు నెలకొల్పాలని సూచించారు. ఏ ఒక్కరికి నష్టం జరగకూడదని స్పష్టం చేశారు.