Scholarships : కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ కీప్ ఇండియా స్మయిలింగ్ ఫౌండేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తోంది. పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించనుంది. అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలకు మించకూడదు. ఆసక్తిగల విద్యార్థులు నవంబరు 30 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఈ ఏడాది పదోతరగతిలో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన కాలేజ్లో ఇంటర్లో ప్రవేశం పొంది ఉండాలి. ఏడాదికి రూ.20,000 చొప్పున రెండేళ్లు స్కాలర్షిప్ అందజేస్తారు.
డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు సంబంధించి ప్రథమ శ్రేణి మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన కళాశాలలో మూడేళ్ల డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి.
ఏడాదికి రూ.30,000 చొప్పున మూడేళ్లు స్కాలర్షిప్ ఇస్తారు.
క్రీడాకారులకు సంబంధించి గత రెండు, మూడేళ్లలో రాష్ట్ర , జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం, దేశం తరపున ఏ క్రీడా విభాగంలోనైనా ప్రాతినిధ్యం వహించి ఉండాలి. దేశవ్యాప్తంగా 500 లోపు, రాష్ట్రవ్యాప్తంగా 100 లోపు ర్యాంకు సాధించి ఉండాలి. జూన్ 30 నాటికి 9 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ప్రముఖ క్రీడా సంస్థ, ఫెడరేషన్, అకాడమీ, కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది ఉండాలి. ఏడాదికి రూ.75,000 చొప్పున మూడేళ్లు స్కాలర్షిప్ అందిస్తారు.
ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి ఈ ఏడాది ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంజనీరింగ్ ఫస్టియర్లో ప్రవేశం పొంది ఉండాలి. ఏడాదికి రూ.30,000 చొప్పున నాలుగేళ్లు స్కాలర్షిప్ అందజేస్తారు.
సమాజ సేవకులకు సంబంధించి చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పేద పిల్లలకు చదువు చెప్పడం, క్రీడాంశాలలో శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహించి ఉండాలి. ఏడాదికి రూ.75,000 చొప్పున రెండేళ్లు ఫౌండేషనల్ గ్రాంట్ గా అందజేస్తారు.
పూర్తి వివరాలకు వెబ్సైట్:https://colgatecares.co.in/keepindiasmiling/index.html