అరవై ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ నాయకులు

  • Publish Date - March 9, 2020 / 09:07 AM IST

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత 60ఏళ్ల వయస్సులో వివాహం చేసుకున్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ ఆదివారం(08 మార్చి 2020) తన పాత స్నేహితురాలు రవీనా ఖురానాను పెళ్లి చేసుకున్నారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, రాజ్యసభ ఎంపి అహ్మద్ పటేల్ సహా కాంగ్రెస్ అగ్ర నాయకులు అందరూ ఈ పెళ్లికి హాజరయ్యారు.

వీరి వివాహం ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో నిరాడంబరంగా జరిగింది. ముకుల్‌ వాస్నిక్‌ ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు. ముకుల్‌ వాస్నిక్ కాంగ్రెస్‌లో పలు పదవులు చేపట్టారు. ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇక రవీనా ఖురానా న్యాయవాదిగా వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. వీరిద్దరి మధ్య 1984 నుంచి పరిచయం ఉందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. 

See Also | eSIM సపోర్ట్‌తో Oppo ఫస్ట్ స్మార్ట్ వాచ్ .. ఆపిల్ వాచ్‌లానే ఉంది!

ట్రెండింగ్ వార్తలు