Congress Party releases its manifesto for the 2024 Lok Sabha elections at AICC headquarters in Delhi
కాంగ్రెస్ పార్టీ ఇవాళ లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీ నుంచి న్యాయ్ పత్ర పేరుతో మ్యానిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. 48 పేజీలతో ఈ మ్యానిఫెస్టోను రూపొందించారు.
ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమంపై ప్రధానంగా దృష్టి పెట్టి కాంగ్రెస్ మ్యానిఫెస్టోను రూపొందించినట్లు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తెలిపారు. బీజేపీ పాలనలో దేశంలో ప్రజలకు ఎలాంటి న్యాయమూ జరగలేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి, అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తుందని అన్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు
#WATCH | Congress Party releases its manifesto for the 2024 Lok Sabha elections, at AICC headquarters in Delhi.
#LokSabhaElections2024 pic.twitter.com/lNZETTLDLY
— ANI (@ANI) April 5, 2024