Cop Assassinated His Wife: భార్యను హత్య చేసిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌

భార్యను హత్య చేసి సాధారణ మరణంగా నమ్మించేందుకు ప్రయత్నించాడో ఎస్ఐ.. కానీ పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టడంతో అది సాధారణ మరణం కాదు హత్య అని తేలింది.

Cop Assassinated His Wife: భార్యను హత్య చేసి సాధారణ మరణంగా నమ్మించేందుకు ప్రయత్నించాడో ఎస్ఐ.. కానీ పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టడంతో అది సాధారణ మరణం కాదు హత్య అని తేలింది. ఘటన వివరాల్లోకి వెళితే తమిళనాడులోని క్రిష్ణగిరి సమీపంలోని దాసరపల్లి గ్రామానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ కు, 13 ఏళ్ల క్రితం రాజ్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.

రమేష్ క్రిష్ణగిరి డ్యాం పోలీస్ స్టేషన్ లో స్పెషల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ రాయకోట రోడ్డులోని పోలీస్‌ క్వాటర్స్ లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. గత నెల 23న రమేష్, అతడి భార్య రాజ్యలక్ష్మికి మధ్య గొడవ జరిగింది. ఇదే సమయంలో అతడు అనే గొంతునులిమి హత్యచేశాడు. అనంతరం ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.

అయితే అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టంలో ఇది హత్యే అని వైద్యులు నిర్దారించారు. దీంతో రమేష్ ను అదుపులోకి తీసుకున్న క్రిష్ణగిరి తాలూకా పోలీసులు విచారించారు. విచారణలో నేరం ఒప్పుకున్నాడు రమేష్.. దీంతో అతడిపై హత్యకేసు నమోదు చేశారు పోలీసులు.

ట్రెండింగ్ వార్తలు