Delhi fire : ఢిల్లీ మాయాపురి ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం..9మందికి గాయాలు
ఢిల్లీలో మాయాపురిలోని ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 2.05 గంటలకు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి....
- saleem sk
- Published On : August 9, 2023 / 10:32 AM IST
Delhi factory fire breaks out
Delhi fire breaks out : ఢిల్లీలో మాయాపురిలోని ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 2.05 గంటలకు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక శాఖ వాహనాలు వచ్చి మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. సోఫా స్ప్రింగ్ బాక్సులో మంటలు రాజుకున్నాయి.
Jammu-Srinagar : రాంబన్ వద్ద విరిగిపడిన కొండచరియలు..అమరనాథ్ యాత్రకు బ్రేక్
మంటల్లో చిక్కుకున్న 9 మంది ఫ్యాక్టరీ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. (Delhi 9 injured as fire breaks out) గాయపడిన ఫ్యాక్టరీ కార్మికులను దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అవుటర్ ఢిల్లీ ఉద్యోగనగర్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో జులై 30వతేదీన అగ్నిప్రమాదం జరిగింది.
