జై భీమ్ స్కీమ్ కింద ఇచ్చే అమోంట్ ను పెంచాలని నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 40వేల రూపాయలు ఇస్తుండగా,ఇకపై 1లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ పథకానికి అన్ని కేటగిరీల విద్యార్థులు అర్హులవుతారని ఆయన తెలిపారు. జనరల్ కేటగిరీలోని ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు కూడా అర్హులేనని సీఎం అన్నారు.
అయితే ఈ స్కీమ్ కి ఓ కండిషన్ ఉందని ఆయన అన్నారు. ఢిల్లీకి చెందినవారై ఉండాలి, ఢిల్లీ నుంచి 10వ తరగతి,12వ తరగతి పాస్ అయి ఉంటేనే, కుటుంబ ఆదాయం 8లక్షల కన్నా తక్కువ ఉంటేనే ఈ స్కీమ్ ద్వారా లబ్ది పొందేందుకు అర్హులవుతారని ఆయన తెలిపారు.
Delhi Chief Minister Arvind Kejriwal: There is a condition for this scheme, the child will have to be from Delhi and he should have passed out from class 10 and class 12 from Delhi. Only then will he be eligible for this scheme. The family income should be less than Rs 8,00,000. https://t.co/JMrTiuMl1H
— ANI (@ANI) September 3, 2019