Raksha Bandhan : రక్షాబంధన్ సందర్భంగా ఢిల్లీలో అదనంగా 106 మెట్రో సర్వీసులు
రక్షాబంధన్ సందర్భంగా ఢిల్లీలో అదనంగా 106 మెట్రో రైలు సర్వీసులు నడపనున్నారు. ఢిల్లీలో రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 106 మెట్రోరైలు సర్వీసులను నడపనున్నారు.
- saleem sk
- Published On : August 30, 2023 / 01:06 PM IST
Delhi Metro
Raksha Bandhan : రక్షాబంధన్ సందర్భంగా ఢిల్లీలో అదనంగా 106 మెట్రో రైలు సర్వీసులు నడపనున్నారు. ఢిల్లీలో రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 106 మెట్రోరైలు సర్వీసులను నడపనున్నారు. (Delhi Metro To Operate Over 106 Extra Train Services) రద్దీ నేపథ్యంలో అదనపు సిబ్బందితో టికెట్ కౌంటర్ల సంఖ్యను కూడా పెంచనున్నారు.
Leopard : అనారోగ్యానికి గురైన చిరుతపులిని గ్రామస్థులు ఏం చేశారంటే…
ఢిల్లీ మెట్రోరైలు ప్రయాణికులు డీఎంఆర్సీ ట్రావెల్ మొబైల్ యాప్, క్యూఆర్ కోడ్ సాయంతో టికెట్లు కొనుగోలు చేయవచ్చని అధికారులు చెప్పారు. రక్షాబంధన్ సందర్భంగా మెట్రోరైలు స్టేషన్లలో అదనంగా గార్డులు, కస్టమర్ ఫెసిలిటేషన్ ఏజెంట్లను నియమించామని ఢిల్లీ మెట్రో తెలిపింది.
