Delimitation Bill: లోక్సభ స్థానాలు 850కి పెంపు..! నియోజకవర్గాల పునర్ విభజనపై కేంద్రం ప్రతిపాదనలు
131వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్ సభ సీట్ల సంఖ్య 543 నంచి 850కి పెరగనుంది.
- Naveen
- Updated on- April 14, 2026 / 04:45 PM IST
Delimitation Bill: నియోజకవర్గాల పునర్ విభజనపై కేంద్రం ప్రతిపాదనలు చేసింది. లోక్ సభ స్థానాలు 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఆర్టికల్ 81ను సవరించి లోక్ సభ సీట్ల సంఖ్యను పెంచే ప్రతిపాదన చేసింది. 131వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్ సభ సీట్ల సంఖ్య 543 నుంచి 850కి పెరగనుంది. ఇందులో రాష్ట్రాలకు 815 లోక్ సభ స్థానాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 లోక్ సభ స్థానాలు రానున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు సమాచారం అందించింది కేంద్రం.
Also Read: హర్మూజ్ దిగ్బంధనం.. ఇండియాలో తగ్గిపోతున్న చమురు నిల్వలు.. ఇక సామాన్యులు బతకడం కష్టమే..!
