Pralhad Joshi: రాష్ట్రపతి భవన్ కీలక ప్రకటన.. ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ బాధ్యతలు
కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రహ్లాద్ జోషి(Pralhad Joshi)కి విద్యాశాఖ అదనపు బాధ్యతలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
- V Santhosh Kumar
- Published on- July 25, 2026 / 09:00 PM IST
Dharmendra pradhan resignation accepted pralhad joshi education minister
- రాజీనామా ఆమోదించిన రాష్ట్రపతి
- ప్రహ్లాద్ జోషికి బాధ్యతలు
- కేంద్రంలో ఊహించని మార్పులు
Pralhad Joshi: ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారికంగా ఆమోదించారు. దేశంలో తలెత్తిన తాజా పరిస్థితుల దృష్ట్యా ప్రధానమంత్రి సూచనల మేరకు రాష్ట్రపతి భవన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
India vs Zimbabwe: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం
ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు:
ధర్మేంద్ర ప్రధాన్ వైదొలగడంతో ఖాళీ అయిన విద్యాశాఖ బాధ్యతలను మరొక కీలక నేతకు అప్పగించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రహ్లాద్ జోషి(Pralhad Joshi)కి విద్యాశాఖ అదనపు బాధ్యతలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.
