Earthquake In Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.8గా నమోదు

ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో భూకంపం సంభవించింది. అంబికాపూర్‌ సమీపంలో శుక్రవారం (అక్టోబర్14,2022) ఉదయం 5.28 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ పేర్కొంది.

Earthquake In Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో భూకంపం సంభవించింది. అంబికాపూర్‌ సమీపంలో శుక్రవారం (అక్టోబర్14,2022) ఉదయం 5.28 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ పేర్కొంది.

Earthquake In Adilabad : ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో స్వల్ప భూకంపం

అంబికాపూర్‌కు 65 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు ఏర్పడ్డాయని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు