Earthquake In Arunachal Pradesh : అరుణాచల్ప్రదేశ్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 3.7 తీవ్రత నమోదు
అరుణాచల్ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున కమెంగ్లో ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 3.7 భూకంప తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
- bheemraj
- Published On : November 1, 2022 / 07:54 AM IST
earthquake in arunachal pradesh
Earthquake In Arunachal Pradesh : అరుణాచల్ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున కమెంగ్లో ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 3.7 భూకంప తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అసోంలోని జోర్హాట్కు 178 కి.మీ దూరంలో భూమికి 10 కిమీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.
Earthquake In Chhattisgarh : ఛత్తీస్గఢ్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.8గా నమోదు
ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు చెప్పారు. మరోవైపు పాక్లోనూ అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్కు 303 కి.మీ దూరంలో 4.8 తీవ్రతతో భూకంపం సభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రాన్ని 120 కి.మీ లోతులో గుర్తించినట్లు పేర్కొంది.
