EPFO Interest Rate : ఉద్యోగులకు భారీ షాక్.. 8.1 శాతానికి ఈపీఎఫ్ వడ్డీ తగ్గింపు..!
EPFO Interest Rate : ఈపీఎఫ్ఓ సభ్యులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)పై వడ్డీ రేటును భారీగా తగ్గించింది.
- Sreehari A
- Published On : June 3, 2022 / 09:37 PM IST
Epfo Interest Rate Govt Approves Reduction Of Epf Interest Rate To 8.1% For Fy22
EPFO Interest Rate : ఈపీఎఫ్ఓ సభ్యులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)పై వడ్డీ రేటును భారీగా తగ్గించింది. 40 ఏళ్ల కనిష్ట స్థాయి 8.1 శాతానికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. EPF వడ్డీ రేటు 1977-78 నుంచి 8 శాతంగా తక్కువగా ఉంది. ఈ ఏడాది మార్చిలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 6.4 కోట్ల మంది చందాదారుల రిటైర్మెంట్ సేవింగ్స్పై వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ ధృవీకరించిన చెల్లింపు, ఏజెన్సీ ఆదాయాలకు అనుగుణంగా ఆమోదాన్ని తెలిపింది.
గత ఏడాదిలో 8.5 శాతం ఆదాయాలతో పోలిస్తే.. ఈ ఏడాది ఆదాయాల EPFO రూ. 76,768 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. 7.9 శాతం ఆదాయాన్ని పొందింది. మార్చిలో గౌహతిలో జరిగిన EPFO సమావేశం తర్వాత కేంద్రం ఆమోదం తెలిపింది. దాంతో కార్మికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈపీఎఫ్వో 2020-21లో 8.5 శాతం వడ్డీరేటు చెల్లించింది. ప్రస్తుతం ఈపీఎఫ్వోలో 5 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సబ్స్క్రైబర్ల అకౌంట్లో గతేడాది డిపాజిట్లపై వడ్డీరేటును క్రెడిట్ చేసే ప్రక్రియను ఈపీఎఫ్వో చేపట్టింది.
ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో ద్రవ్య విధానం కఠినతరం అవుతుందనే అంచనాల నేపథ్యంలో పతనమైన స్టాక్ మార్కెట్ల కారణంగా వడ్డీ పేమెంట్స్ ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. మార్చి 2020లో, EPFO ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2018-19లో 8.65 శాతం నుంచి 2019-20కి ఏడేళ్ల కనిష్ట స్థాయి 8.5 శాతానికి తగ్గించింది. 2020-21కి సంబంధించి EPF డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ రేటును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) మార్చి 2021లో నిర్ణయించింది.
Read Also : EPFO Customers Alert : మీ పీఎఫ్ అకౌంట్లో ఈ-నామినేషన్ చేయలేదా? రూ.7 లక్షలు పోయినట్టే..!
