Tamil Nadu : తమిళనాడులో విషాదం నెలకొంది. ధర్మలింగేశ్వర ఆలయం తీర్థవర్థి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. వాటర్ ట్యాంక్ లో పడి ఐదుగురు యువకులు మృతి చెందారు. చెన్నై మూవరసంపేట ట్యాంక్ లో పడి బుధవారం ఉదయం ఐదుగురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 18 నుంచి 23 ఏళ్ల వయసు కలిగిన ఐదుగురు యువకులు నీటిలో మునిగి గల్లంతయ్యారు.
సమాచారం అందిన వెంటనే పలవంతంగల్ పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఐదుగురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Tamil Nadu : అరక్కోణం ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. క్రేన్ బోల్తా పడి నలుగురు మృతి
ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం క్రోమ్ పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు మడిపాక్కంకు చెందిన రాఘవన్, కీల్ కట్టలైకి చెందిన యోగేశ్వరన్, నంగనల్లూరుకు చెందిన వనేష్, రాఘవన్, ఆర్.సూర్యగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.