G20 Summit 2023
G20 Summit 2023 – Delhi: ఢిల్లీలో జీ 20 సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏర్పాట్లను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పరిశీలించనున్నారు. జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆయా దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో వారి కోసం ఢిల్లీ, గురుగ్రామ్లోని 21 హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. దాదాపు 3,500 గదులను బుక్ చేశారు.
అత్యంత విలాసవంతమైన హోటళ్లలో వారు బస చేస్తారు. చాణక్యపురిలోని ఐటీసీ మౌర్య షెరటన్ హోటల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బస చేస్తుండడతో ఆ హోటల్లోని ప్రతి అంతస్తులో సీక్రెట్ సర్వీస్ కమాండోలు భద్రత కల్పించనున్నారు. 14వ అంతస్తులో జో బైడెన్ కు వసతి ఏర్పాట్లు చేశారు. చైనా ప్రధాని లీ కియాంగ్ న్యూఢిల్లీ చాణక్యపురి తాజ్ ప్యాలెస్ లో బస చేస్తారు.
అదే ప్యాలెస్లో బ్రెజిల్ ప్రతినిధి బృందం బస చేయనుంది. న్యూఢిల్లీ కన్నాట్ ప్లేస్లోని షాంగ్రీ-లా ఈరోస్ హోటల్లో బ్రిటన్ ప్రధాని రిషి సునక్, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ బస చేయనున్నారు. మోతీలాల్ నెహ్రూ మార్గ్లోని క్లారిడ్జెస్ హోటల్ లో బస చేయనున్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కన్నాట్ ప్లేస్లోని ఇంపీరియల్ హోటల్లో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ఉంటారు.
ఢిల్లీ ఒబెరాయ్ హోటల్లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ బస చేస్తారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ గురుగ్రామ్ ఒబెరాయ్ హోటల్ లో బస చేయనున్నారు. న్యూ ఢిల్లీ ఏరోసిటీలోని జేడబ్ల్యూ మారియట్, బికాజీ కామా ప్లేస్లోని హయత్ రీజెన్సీలో ఇటాలియన్ ప్రతినిధి బృందం ఉంటుంది.
లే మెరిడియన్ హోటల్ లో నెదర్లాండ్స్, నైజీరియా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు బస చేస్తారు. లలిత్ హోటల్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రతినిధి బృందం ఉంటారు. లీలా హోటల్లో సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ బస చేస్తారు.
G20 Summit 2023: అర్ధరాత్రి నుంచి ఢిల్లీలో ఆంక్షలు.. మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో..