Mystery Disease : చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్.. అలర్ట్ అయిన భారత్

చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోవిడ్-10 తరహాలో ఇది విరుచుకుపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారత్ అలర్ట్ అయ్యింది.

Mystery Disease : ప్రపంచాన్ని వణించిన కోవిడ్ -19 మహమ్మారిని మర్చిపోక ముందే రకరకాల వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. చైనాలో మరో మిస్టీరియస్ వైరస్ కలకలం రేపుతోంది. ఇది కూడా కోవిడ్ తరహాలో విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారత్ అలర్ట్ అయ్యింది.

Alert : చైనాలో హెచ్9ఎన్2 మహమ్మారి వ్యాప్తి…కేరళలో ఆరోగ్యశాఖ అధికారుల అలర్ట్

కోవిడ్ తరహాలో చైనాలో మిస్టీరియస్ న్యుమోనియా వైరస్ విజృంభిస్తోంది. సౌత్ చైనాలో ముఖ్యంగా పిల్లల్లో ఈ వైరస్ వ్యాప్తి గణనీయంగా ఉంది. అక్కడి ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో వీరు ఇబ్బంది పడుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తికి గల కారణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చైనాను వివరణ కోరింది.

మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ప్రజలు పరిశుభ్రంగా ఉండాలని, వైద్యుల సూచనలు పాటించాలని సూచించింది. ఈ కొత్త వైరస్ వ్యాప్తికి గల కారణాలపై చైనా ఆరోగ్య అధికారులు అంతర్జాతీయ నిపుణుల సహకారంతో ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైరస్ కోవిడ్-19 ను పోలి ఉన్నప్పటికీ దీనికి మూలం మాత్రం కరోనా వైరస్ అని ప్రాథమిక పరీక్షలు నివేదిస్తున్నాయి. ప్రస్తుతం ప్రయాణాలపై ఎటువంటి ఆంక్షలు లేనప్పటికీ ఈ కేసులు మాత్రం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Mysterious Pneumonia : చైనాలో మిస్టరీగా మారిన మరో మహమ్మారి న్యుమోనియా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

చైనాలో కొత్త వైరస్ కలకలం నేపథ్యంలో భారత్ అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్ కు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై వెంటనే సమీక్ష నిర్వహించాలని సూచించింది. ఆసుపత్రుల్లో బెడ్లు, మందులు, ఇన్ ఫ్లూయెంజా వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లపై దృష్టి పెట్టాలని కేంద్ర వైద్య‌శాఖ లేఖ రాసింది.

ట్రెండింగ్ వార్తలు