Coronavirus India: కరోనా ఉపశమనం.. దేశంలో భారీగా తగ్గిన కేసులు
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
- vamsi
- Updated on- February 22, 2022 / 02:16 PM IST
Coronavirus India
Coronavirus India: దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 13 వేల 405 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 235 మంది చనిపోయారు. దేశంలో పాజిటివిటీ రేటు 1.98కి తగ్గింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1 లక్షా 81 వేల 75కి తగ్గింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5 లక్షల 12 వేల 344కు పెరిగింది. ఇప్పటివరకు 4 కోట్ల 21 లక్షల 58 వేల 510 మంది కరోనా సోకి కోలుకున్నారు.
కరోనా మూడో వేవ్ దాదాపుగా తగ్గుముఖం పట్టినట్టుగా నివేదికలు చెబుతున్నాయి.
దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితి:
యాక్టివ్ కేసులు: 1,81,075
మొత్తం రికవరీలు: 4,21,58,510
మొత్తం మరణాలు: 5,12,344
మొత్తం టీకాలు: 1,75,83,27,441
రోజువారీ సానుకూలత రేటు: 1.98%
దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24గంటల్లో కేవలం 360 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో నలుగురు కరోనాతో మరణించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 176 కోట్ల యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది.
