India Corona Cases : దేశంలో కొత్తగా 1,046 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,54,638కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,618 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 53 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 5,29,077కి చేరినట్లు పేర్కొంది. ఇక మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని తెలిపింది.
Covid in endemic phase: ఎండెమిక్ దశకు చేరుకున్న కరోనా: నిపుణులు
రికవరీ రేటు 98. 78శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.64 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.