×
Ad

Encounter: ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి.

  • Published On : December 16, 2021 / 08:19 AM IST

Terror

Kulgam Encounter: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. అర్థరాత్రి ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ఇరువైపులా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను సైనికులు హతమార్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఈమేరకు కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు, ‘కుల్గామ్ ఎన్‌కౌంటర్ అప్‌డేట్: ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

అజ్ఞాతంలో ఉన్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌ జరిగిందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశానికి భద్రతా బలగాలు చేరుకోవడంతో అటువైపు నుంచి భారీగా కాల్పులు జరిగాయని వెల్లడించారు. అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా దళాలు ఆ ప్రాంతంలోని అన్ని ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలను మూసివేశారు. సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Covid Third Wave: కరోనా మూడో వేవ్ కచ్చితంగా వస్తుంది.. నిపుణుల హెచ్చరిక!