Jharkhand : ఝార్ఖండ్‌లో రైలు ప్ర‌మాదం.. ప‌ట్టాలు త‌ప్పిన హౌరా- సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్..

ఝార్ఖండ్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున హౌరా - సీఎస్ఎంటీ రైలు పట్టాలు తప్పింది. మూడు బోగీలు ..

Train Accident Jharkhand

Train Accident Jharkhand : ఝార్ఖండ్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున 3.45గంటల సమయంలో హౌరా – సీఎస్ఎంటీ రైలు పట్టాలు తప్పింది. మూడు బోగీలు పట్టాలు తప్పి కిందపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వారిని చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఝార్ఖండ్ లోని చక్రధర్ పూర్ డివిజన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Also Read : పెంపుడు కుక్కకు అతిగా ఆహారం పెట్టినందుకు మహిళకు జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా?

సమాచారం ప్రకారం.. హౌరా – సీఎస్ఎంటీ ఎక్స్ ప్రెస్ ప్రమాదం సమయంలో మూడు బోగీలు పట్టాలు తప్పి.. అవి పక్కనే నిలిచిఉన్న గూడ్స్ రైలుపై పడినట్లు సమాచారం. అయితే, రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు