karnataka assembly elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు 200 శాతం ఉన్నాయంటూ టీచర్ల వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్ షేర్ చేసిన ఓ ప్రభుత్వ టీచర్ చిక్కుల్లో పడ్డారు. కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలోని భానాపూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమశేఖర్ హార్తి అనే వ్యక్తి టీచర్ గా పనిచేస్తున్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో దీనిపై అత్యుత్సాహం ప్రదర్శించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఓ పార్టీకి సానుకూలంగా మెసేజ్ షేర్ చేశారు. దీంతో ఈ విషయంపై స్థానిక జర్నలిస్టు ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా, సోమశేఖర్ కు అధికారుల నుంచి నోటీసు అందింది. సోమశేఖర్ అసిస్టెంట్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగానూ ఉన్నారు.
కాంగ్రెస్ కు సానుకూలంగా మెసేజ్ చేసిన ఘటనపై అధికారులు మాట్లాడుతూ.. ఆ టీచర్ కర్ణాటక సివిల్ సర్వీసెస్ రూల్స్ కి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని చెప్పారు. ఈ ఘటనతో ఉన్నతాధికారులు జిల్లాలోని అన్ని పాఠశాలలను పలు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీకైనా సానుకూలంగా వ్యవహరిస్తూ పోస్టులు చేయకూడదని చెప్పారు.
Maheshwar Reddy: రేపటి నుంచి మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర