మద్యం అమ్మకాలను మరింత వేగవంతం చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ నుంచి ఢిల్లీలోని అన్ని మద్యం దుకణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అవకాశం కల్పించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మద్యం దుకాణాలకు ఇవే వేళలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
కరోనా వైరస్ కారణంగా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే ఢిల్లీలో కూడా గత మార్చి నుంచి మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అయితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సడలింపుల మేరకు మే నెలలో మద్యం షాపులు పునఃప్రారంభమయ్యాయి.
ఢిల్లీ ప్రభుత్వం ముందుగా సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతించింది. క్రమంగా ఆ సమయాన్ని పెంచుతూ ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు తీసుకొచ్చింది.