ఎవరీ ఐశ్వర్య మీనన్..! మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెను ఎందుకు ఆహ్వానించారో తెలుసా?

మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సుమారు 8వేల మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. వీరిలో ఐశ్వర్య మీనన్ కూడా ఒకరు.

Aiswarya S Menon (Credit _ Google)

Aiswarya Menon : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సుమారు 8వేల మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. వీరిలో పొరుదేశాల అధినేతలతోపాటు.. దేశంలోని పలు రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు ఉన్నారు. ఇప్పటికే వీరికి ఆహ్వానాలుసైతం వెళ్లారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని వందేభారత్ లోకో పైలట్ ఐశ్వర్య ఎస్ మీనన్ కు కూడా అధికారులు ఆహ్వానాన్ని అందించారు. దీంతో ఐశ్వర్య ఎస్ మీనన్ ఎవరు అనే చర్చ జరుగుతుంది.

Also Read : Gold Rate : బంగారం, వెండి కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు

ఐశ్వర్య ఎస్ మీనన్ దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్ సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో, జన శతాబ్ధి వంటి వివిధ రైళ్లలో పైలట్ గా చేస్తూ రెండు లక్షలకుపైగా ఫుట్‌ప్లేట్ గంటలను పూర్తి చేశారు. చెన్నై – విజయవాడ, చెన్నై – కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులలో కూడా మీనన్ పనిచేశారు. మీనన్ తన చురుకుదనంతో రైల్వే సిగ్నలింగ్ పై సమగ్ర పరిజ్ఞానంతో నాణ్యమైన సేవలు అందిస్తూ సీనియర్ అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

Also Read : టీడీపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే? సెంట్రల్ క్యాబినెట్‌లో టీడీపీకి ఎన్ని స్థానాలంటే..

ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు పది మంది లోకో పైలట్లకు ఆహ్వానం అందింది. వారిలో ఐశ్వర్య మీనన్ తో పాటు ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్ కూడా ఉన్నారు. సురేఖ యాదవ్ 1988లో భారతదేశం తొలి మహిళా లోకో పైలెట్ గా చరిత్ర సృష్టించారు. అదేవిధంగా సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తదితరులు పెద్ద సంఖ్యలో మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు