Tragedy : పెళ్ళిరోజే భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..అప్పుల బాధ తాళలేక
ప్రకాష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ప్రకాష్ చెన్నైలోని పల్లవరంలో నివాసముంటున్నారు. ప్రకాశ్ కు అప్పులు అధికమయ్యాయి.
- bheemraj
- Published On : May 29, 2022 / 11:38 AM IST
Chennai
Tragedy In Chennai : చెన్నైలో దారుణం జరిగింది. పెళ్ళిరోజునే కుటుంబ మొత్తాన్ని చంపి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళలేక భార్య, ఇద్దరు పిల్లలను రంపంతో కోసి చంపిన తర్వాత సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చెన్నై నగరంలోని పల్లవరంలో చోటు చేసుకుంది.
ప్రకాష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ప్రకాష్ చెన్నైలోని పల్లవరంలో నివాసముంటున్నారు. ప్రకాశ్ కు అప్పులు అధికమయ్యాయి. ప్రకాష్..ఎలక్ట్రిక్ రంపాన్ని అమెజాన్లో కొనుగోలు చేశారు. అప్పుల బాధ తాళలేక భార్య, ఇద్దరు పిల్లలను రంపంతో కోసి చంపాడు.
ముగ్గురిని చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్ళిరోజునే కుటుంబ మొత్తాన్ని చంపి, ప్రకాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
