Massive fire accident in Delhi : ఢిల్లీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మంగళవారం ఓల్డ్ సీమాపురి ప్రాంతంలోని మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని నలుగురు సజీవదహనమయ్యారు.
హస్తినలోని ఇరుకు గల్లీలో జరిగిన అగ్నిప్రమాదంతో ప్రజలు భయాందోళన చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
Corona Vaccine : త్వరలోనే అందుబాటులోకి మరో టీకా
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.