కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నోబెల్ సహన బహుమతి ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరుతున్నారు.రాహుల్ కి ఇంత సహనం ఎక్కడినుంచి వచ్చిందబ్బా అని ఫన్నీగా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.ఎంత కోపం వచ్చేలా చేసిన కూల్ గా ఉన్న రాహుల్ పై ట్విట్టర్,ఫేస్ బుక్ లలో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం(ఏప్రిల్-16,2019) కేరళ రాజధాని తిరువనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు.రాహుల్ కి ట్రాన్స్ లేటర్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ పిజే కురియన్ స్టేజిపై నిలబడ్డారు.రాహుల్ ఇంగ్లీష్ లో ప్రసంగించినప్పుడు దాన్ని మళయళంలో ప్రజలకు చెప్పేందుకు రాహుల్ పక్కన నిలబడిన కురియన్ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు.రాహుల్ స్పీచ్ ని అర్థం చేసుకోవడంలో కురియన్ తడబడ్డారు.రాహుల్ చెప్పేది అర్థంకాక ఆయన మొఖంవైపు చూడటం,రాహుల్ మరోసారి కురియన్ చెవిలో చెప్పడం అలా కొద్ది సేపు జరగడం అక్కడున్నవారందరికి నవ్వు ఆపుకోలేకుండా చేసింది.
అయితే గాలి ఎక్కువగా వీస్తున్నకారణంగా వినబడటం లేదంటూ కురియన్ రాహుల్ కి అత్యంత దగ్గరగా నిలబడ్డారు.అయితే ఆ సమయంలో కురియన్ తన ఎదురుగా ఉన్న మైక్ ను పక్కకు జరిపి రాహుల్ స్పీచ్ ని మళయాలంలోకి ట్రాన్స్ లేట్ చేసేందుకు ప్రయత్నించాడు.దీన్ని గమనించిన రాహుల్ మైక్ ను కురియన్ దగ్గరికి జరిపాడు.అయితే మళ్లీ కురియన్ యధావిధిగా మైక్ ను పక్కకుబెట్టి ట్రాన్స్ లేట్ చేసేందుకు ప్రయత్నించాడు.దీంతో మరోసారి రాహుల్ మైక్ ను ఆయన దగ్గరకు పెట్టారు.అయితే ఇంత జరుగుతున్నా రాహుల్ మాత్రం కురియన్ పై కోప్పడలేదు.నవ్వుతూ కురియన్ వైపు చూస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రాహుల్ సహనానికి నోబెల్ ఇవ్వాల్సిందేనంటూ నెటిజన్లు ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు.
Gotta give it to Rahul Gandhi for his patience ?? pic.twitter.com/Sg0SgdwGMj
— Shilpa Nair (@NairShilpa1308) April 16, 2019