యువత భవిష్యత్ ను మోడీ,షా నాశనం చేశారు…రాహుల్

పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌరసత్వ నమోదు(NRC)పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతలు,నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయమై యువతకు కీలక సందేశాన్ని అందించారు. తీవ్ర సంక్షోభంలో పడిన ఆర్థిక వ్యవస్థ, తీవ్ర నిరుద్యోగం ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలను భయపెడుతున్నాయని, దేశ యువత కోపాన్ని ఎదుర్కోలేకనే విద్వేష,విభజన రాజకీయాలు చేస్తున్నారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అయితే ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేయడంలో హింసకు పాల్పడరాదని, ప్రేమతోనే వారిని ఓడించాలని ఆయన తెలిపారు.
 
ప్రియమైన యువజనులారా..నరేంద్రమోడీ, అమిత్ షా మీ భవిష్యత్‌ను నాశనం చేశారు. లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు. ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. వీటి నుంచి వ్యక్తమయ్యే మీ కోపాన్ని వారు ఎదుర్కోవడానికి భయపడుతున్నారు. అందుకే వారి మనసుల్లో ద్వేషాన్ని దాచుకొని ప్రేమగా ఉన్న మన మధ్య చిచ్చు పెడుతున్నారు. ప్రతి భారతీయుడి పట్ల ప్రేమను చూపించడంతోనే మనం వారిని ఓడించాలి అంటూ రాహుల్ ట్వీట్ లో తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు