Modi Pune Visit: మిస్టర్ క్రైం మినిస్టర్ అంటూ మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వివాదాస్పద పోస్టర్లు

మణిపూర్ హింసాకాండతో సహా అనేక ఇతర అంశాలపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పూణెలో పర్యటించి దగ్దుషేత్ ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు

Mr Crime Minister Poster: మంగళవారం పూణెలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఒక రోజు ముందుగానే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ‘మోదీ గో బ్యాక్’ అంటూ నగరమంతటా పోస్టర్లు వేశారు. మణిపూర్‌లో అశాంతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ యువజన విభాగం పూణె నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పోస్టర్‌లు అంటించింది. అయితే అందులోని ఒక పోస్టర్ లో ‘మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్’ అంటూ రాసి ఉండడం కలకలం సృష్టించింది. మరో పోస్టర్‌లో ‘మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌, మణిపూర్‌ వెళ్లండి, పార్లమెంట్‌ను ఎదుర్కోండి’ అని రాసి ఉంది. ఈ అనధికార పోస్టర్లను తొలగించేందుకు పూణె మున్సిపల్ కార్పొరేషన్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

2024 Elections: ఆ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ.. 2024లో ఎన్డీయేకు ఒక్క సీటు కూడా రాదట

మణిపూర్ హింసాకాండతో సహా అనేక ఇతర అంశాలపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పూణెలో పర్యటించి దగ్దుషేత్ ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు. ప్రధాని మోదీని లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుతో సత్కరించడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. లోకమాన్య తిలక్ వారసత్వాన్ని పురస్కరించుకుని తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ 1983లో లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును స్థాపించింది. ఇది దేశం యొక్క పురోగతి, అభివృద్ధికి విశేషమైన, అసాధారణమైన సహకారం చేసిన వారికి ఇస్తారు. ఈ గౌరవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 1న అంటే లోకమాన్య తిలక్ వర్ధంతి రోజున అందజేస్తారు.

Satyapal Malik: రామమందిరంపై దాడి లేదంటే బీజేపీ అగ్ర నేతను చంపడం.. మోదీ ఇంతకు తెగిస్తారంటూ దుమారం రేపిన సత్యపాల్ మాలిక్

ప్రధాని మోదీ మధ్యాహ్నం 12.45 గంటలకు పూణెలో మెట్రో రైలుకు జెండా ఊపి ప్రారంభించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. పింప్రి చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) ఆధ్వర్యంలో వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌ను కూడా ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని మోడీ పర్యటనకు వ్యతిరేకంగా మంగళవారం నిరసన చేసేందుకు విపక్ష పార్టీల కూటమి ఇండియా ప్లాన్ చేస్తోంది.