Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి ఈ మెయిల్ ద్వారా మరో హత్య బెదిరింపు వచ్చింది. రూ.20 కోట్లు చెల్లించాలని, లేకుంటే చంపేస్తానని ముకేశ్ అంబానీ కంపెనీ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. అంబానీకి హత్య బెదిరింపు ఈమెయిల్ పంపిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తమ వద్ద అత్యుత్తమ షూటర్లు ఉన్నారని, తమకు రూ.20కోట్లు ఇవ్వకుంటే హతమారుస్తామని ఈమెయిల్ లో బెదిరించారు.
Also Read : ఇజ్రాయెల్ దాడులతో గాజా గజగజ..ఫోన్లు, ఇంటర్నెట్ నిలిపివేత
ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఫిర్యాదు ఆధారంగా ముంబయిలోని గామ్దేవి పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై సెక్షన్లు 387, 506(2) కింద కేసు నమోదు చేశారు. ముఖేష్ అంబానీకి హత్య బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది బీహార్లోని దర్భంగాకు చెందిన వ్యక్తి ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు అరెస్టయ్యాడు.
Also Read : అత్యాచారం, దోపిడీ కేసుల్లో ముస్లింలు నంబర్ వన్…అసోం ముస్లిం నేత బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు
నిరుద్యోగి అయిన నిందితుడిని రాకేష్ కుమార్ మిశ్రాగా గుర్తించారు. ముంబయిలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ను పేల్చివేస్తానని, ముఖేష్ అంబానీ కుటుంబాన్ని బెదిరించాడు. 2021వ సంవత్సరంలో ముఖేష్ అంబానీ దక్షిణ ముంబయి నివాసం యాంటిలియా వెలుపల 20 పేలుడు జెలటిన్ స్టిక్స్, బెదిరింపు లేఖతో కూడిన స్కార్పియో కారును కనుగొన్నారు.