JEE Main-2022 : జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష తేదీల్లో మార్పులు
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగాల్సివున్న తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక బోర్డు పరీక్షలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పరీక్ష తేదీలను మార
- bheemraj
- Published On : March 14, 2022 / 05:11 PM IST
Jee Main
JEE Main-2022 : జేఈఈ మెయిన్-2022 మొదటి విడత పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగాల్సిన పరీక్షల తేదీలను మార్పుచేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 21, 24, 25, 29, మే1, 4 తేదీల్లో మొదటి విడత పరీక్షలను ఎన్టీఏ నిర్వహించనుంది.
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగాల్సి ఉన్న తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక బోర్డు పరీక్షలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పరీక్ష తేదీలను మారుస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది.
