NEET UG 2026 Results: నీట్ రీ-ఎగ్జామ్ ఫలితాలు విడుదల.. పదకొండు లక్షల మంది అర్హత.. ఇద్దరికి టాప్ ర్యాంక్

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎంతో ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ 2026 (NEET UG 2026 Results)రీ-ఎగ్జామ్ ఫలితాలను గడువుకన్నా ముందే అధికారికంగా విడుదల చేసింది.

National Testing Agency releases NEET UG 2026 results.

  • నీట్ యూజీ ఫలితాలు విడుదల
  • పదకొండు లక్షల మంది అర్హత
  • అమ్మాయిలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు

NEET UG 2026 Results: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎంతో ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్(NEET UG 2026 Results) ఫలితాలను గడువుకన్నా ముందే అధికారికంగా విడుదల చేసింది. పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో జూన్ 21, 2026న తిరిగి నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 11.21 లక్షల మంది అర్హత సాధించారు. ఈ ఫలితాల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.

Telangana Rains: తెలంగాణలో మారుతున్న వాతావరణం.. మూడు రోజులపాటు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్

టాప్ ర్యాంకర్ల జోరు.. అమ్మాయిలదే పైచేయి:

ఈ ఏడాది ఫలితాల్లో పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పన్షుల్ బన్సల్ 720 మార్కులకు గాను 715 మార్కులు సాధించి సంయుక్తంగా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే లడఖ్‌కు చెందిన జిగ్మెట్ యాంగ్‌చాన్ (530), అండమాన్‌కు చెందిన ధ్రువ్ త్రిపాఠి (606) తమ ప్రాంతాల నుండి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మొత్తం అర్హత సాధించిన వారిలో 58 శాతానికి పైగా అమ్మాయిలే ఉండటం గమనార్హం.

రాష్ట్రాల వారీగా ఫలితాలు.. ఎన్‌టీఏ హెచ్చరిక:

రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌ నుంచి అత్యధికంగా 1.7 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కేటగిరీల వారీగా జనరల్‌లో 2.91 లక్షలు, ఓబీసీలో 5.12 లక్షల మంది అర్హత సాధించారు. కాగా, సీట్లు ఇప్పిస్తామంటూ మోసం చేసే దళారులను నమ్మి మోసపోవద్దని, కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారానే సమాచారాన్ని తెలుసుకోవాలని ఎన్‌టీఏ అభ్యర్థులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.