Neet Protest Called Off: సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు.. ప్రధాన డిమాండ్లకు ఆమోదం.. ఆందోళన విరమిస్తున్నట్లు అధికారిక ప్రకటన

నీట్ లీకేజీ (Neet Protest Called Off)వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న విజ్ఞప్తి నెరవేరడంతో పాటు, ఇతర డిమాండ్లపైనా కేంద్రం సానుకూలంగా స్పందించింది.

Neet leak protest called off centre agreed to cjp demands

  • ముగిసిన నీట్ ఆందోళనలు
  • కేసులన్నీ ఎత్తివేస్తున్న కేంద్రం
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

Neet Protest Called Off: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. విద్యావ్యవస్థలో పారదర్శకత లోపించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీజేపీ ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో పోరాటం సాగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, ఆందోళనకారుల ప్రధాన డిమాండ్లను ఆమోదించడంతో దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలకు చివరకు తెరపడింది.

Ap Crop Insurance: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఖరీఫ్ పంట బీమా బకాయిల విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌.. నిధుల విడుదల ఎప్పుడంటే?

నీట్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న విజ్ఞప్తి నెరవేరడంతో పాటు, ఇతర డిమాండ్లపైనా కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సీజేపీ(Neet Protest Called Off) ప్రతినిధులు చర్చలు జరిపారు. ఆందోళనల సందర్భంగా దిల్లీతో పాటు దేశవ్యాప్తంగా నిరసనకారులపై నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేసేందుకు కేంద్రం ఒప్పుకుందని, నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిందని సీజేపీ నాయకులు మీడియాకు వెల్లడించారు.

ఇదే విషయమై కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. నిరసనకారులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని, విద్యావ్యవస్థలోనూ, పరీక్షల నిర్వహణలోనూ సమూల మార్పులు తీసుకువస్తామని స్పష్టం చేశారు. అలాగే నీట్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేంద్రం నుండి స్పష్టమైన హామీలు లభించడంతో తమ ఆందోళనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించి, నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని కోరింది.