130కి.మీ వేగంతో ప్రయాణించే రైళ్లలోని స్లీపర్ కోచ్​లన్నీ ఇకపై ఏసీ బోగీలే

AC coaches for trains running at 130/160 kmph రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తించిన మార్గాల్లో ఇకపై గంటకు 130 కి.మీ, అంతకన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లలోని స్లీపర్​ కోచ్​లు అన్నింటినీ ఏసీ కోచ్​లుగా మార్చనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. రైల్వే నెట్ వర్క్ అప్ గ్రేడేషన్((ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించడం,ఇతర సౌకర్యాలను పెంచడం) లో భాగంగా ఈమేరకు మార్పులు చేస్తున్నట్లు ఆదివారం(అక్టోబర్-11,2020)ఓ సీనియర్ అధికారి తెలిపారు.



అయితే, ఆ రైళ్లల్లో ప్రయాణికులకు సరసమైన ధరలకే టికెట్లు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ ప్రతినిధి డీజే నారాయన్ తెలిపారు. ప్రస్తుతం అనేక మార్గాల్లో మెయిల్ లేదా ఎక్స్​ప్రెస్​ రైళ్లు గంటకు 110కి.మీ లేదా అంతకంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నాయి. రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం​ రైళ్లు మాత్రం 120 కి.మీ వేగంతో తిరుగుతున్నాయి.



అయితే.. వీటి వేగ సామర్థ్యం మరింత పెంచేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని డీజే నారాయణ్​​ తెలిపారు. వాటికి అనుగుణంగా ఆయా రైళ్లకు సాంకేతికంగా ఏసీ కోచ్​లు అమర్చడం అనివార్యమైందని ఆయన తెలిపారు. ప్రస్తుతం 83 రైళ్లలో ఈ ప్రక్రియ చేపట్టాని, ఈ ఏడాదిలోగా 100, వచ్చే సంవత్సరంలో 200 కోచ్​లను ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే.. 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తోన్న రైళ్లలో నాన్​-ఏసీ బోగీలు యథాతథంగా ఉంటాయని నారాయణ్​​ స్పష్టం చేశారు.