మరో విషాదం: ముష్కరుల కాల్పుల్లో మేజర్‌, ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్ పుల్వామా మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. సోమవారం(ఫిబ్రవరి-18-2019) పింగలాన్ ఏరియాలో భద్రతా దళాలు-టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

  • Publish Date - February 18, 2019 / 03:44 AM IST

జమ్మూకశ్మీర్ పుల్వామా మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. సోమవారం(ఫిబ్రవరి-18-2019) పింగలాన్ ఏరియాలో భద్రతా దళాలు-టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

జమ్మూకశ్మీర్ పుల్వామా మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. సోమవారం(ఫిబ్రవరి-18-2019) పింగలాన్ ఏరియాలో భద్రతా దళాలు-టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మేజర్, ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. ఓ స్థానికుడు మృతి చెందాడు. టెర్రరిస్టులు చొరబడ్డారనే సమాచారంతో ఫిబ్రవరి 17వ తేదీ అర్ధరాత్రి జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో ఓ ఇంట్లో నక్కిన ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. బలగాలు దీటుగానే ఎదుర్కొన్నా… 8 గంటలకు పైగా సాగిన కాల్పుల్లో ఓ మేజర్.. ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. పింగలాన్ ప్రాంతానికి భారీగా బలగాలు చేరుకుంటున్నాయి.

 

2019, ఫిబ్రవరి 14వ తేదీ పుల్వామాలో సీర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ సంస్థకు చెందిన సూసైడ్ బాంబర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పెద్ద సంఖ్యలో జవాన్లను పొట్టనపెట్టుకున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీ సిద్ధంగా ఉంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పాక్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపి టెర్రరిస్టులను మట్టుబెడతామని అంటున్నారు. అటు పుల్వామాలో ఉగ్రవాదుల ఏరివేతకు బలగాలు రంగంలోకి దిగాయి. ఊహించని రీతిలో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో మేజర్ సహా నలుగురు జవాన్లు వీర మరణం చెందడం విషాదం నింపింది.

* జమ్మూకశ్మీర్ పుల్వామాలో మళ్లీ ఎన్‌కౌంటర్
* ఉగ్రవాదుల కాల్పుల్లో ఒకమేజర్, ముగ్గురు ఆర్మీ జవాన్లు మృతి
* ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ స్థానికుడు మృతి
* పింగ్లాన్ ప్రాంతానికి చేరుకుంటున్న అదనపు బలగాలు
* 8 గంటలుగా కొనసాగుతున్న ఎదురుకాల్పులు
* ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానం
* సూసైడ్ బాంబర్ అదిల్ అహ్మద్‌ దార్‌కు ఈ ఉగ్రవాదులు సన్నిహితులుగా అనుమానం