పద్మ అవార్డుల కోసం కేంద్ర సర్కారు దరఖాస్తులు స్వీకరిస్తోంది. 2026 గణతంత్ర వేడుకల వేళ ఈ పద్మ అవార్డులను ప్రకటిస్తారు. వీటి కోసం ఈ ఏడాది జులై 31లోగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. awards.gov.in లో నామినేషన్లు, సిఫార్సులను సమర్పించవచ్చు.
ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు చేసే వ్యక్తులకు పద్మ అవార్డులు అందిస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రతి ఏడాది గణతంత్ర వేడుకల వేళ ప్రకటిస్తారు. 1954 నుంచి వీటిని ప్రకటిస్తున్నారు. నిబంధనల వివరాల కోసం https://padmaawards.gov.in/AboutAwards.aspx చూడొచ్చు.
జాతి, వృత్తి, దేశంలోని ప్రాంతం, లింగంతో సంబంధం లేకుండా అందరూ అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే, వైద్యులు, శాస్త్రవేత్తలు తప్ప ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న అర్హులు కారు. నామినీ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో నిర్ణీత ఫార్మాట్లో అడిగిన పలు పత్రాలను అప్లోడ్ చేయాలి. మీ పేరును కూడా మీరే నామినేట్ చేసుకోవచ్చు.
ఈ విభాగాల్లో విశిష్ట కృషి చేస్తే దరఖాస్తులు చేసుకోవచ్చు
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.