Padma Shri Awards
Padma Awards: రిపబ్లిక్ డే వేళ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ఈ సారి 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. పద్మశ్రీ పురస్కారాలు అందుకోనున్న వారిలో తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డి ఉన్నారు. ఆయనకు పాడి, పశుసంవర్థక విభాగాల్లో ఈ పురస్కారం దక్కింది.
హైదరాబాద్కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ (సీసీఎంబీ శాస్త్రవేత్త)కు కూడా పద్మశ్రీ దక్కింది. ఆయన మానవ పరిణామ క్రమం, జన్యుసంబంధ వ్యాధులపై 30 ఏళ్లుగా చేస్తున్న రీసెర్చ్ చేస్తున్నారు. తెలంగాణకు చెందిన దీపికారెడ్డి, గురు వెంకట్రావు, చంద్రమౌళి గడ్డమనుగు, ఆంధ్రప్రదేశ్కు చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, గడ్డె బాబు రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీ మోహన్, వేంపతి కుటుంబ శాస్త్రీకి పద్మశ్రీ దక్కింది.
ఈ ఏడాది పద్మ అవార్డులు దేశం నలుమూలల ఉన్న Unsung heroesలకు అధికంగా దక్కాయి. వెనుకబడిన వర్గాలు, దళిత సముదాయాలు, ఆదివాసీ గిరిజన తెగలు, వసతులు లేని ప్రాంతాలవారు ఇందులో ఉన్నారు. దివ్యాంగులు, మహిళలు, పిల్లలు, దళితులు, గిరిజనుల సేవకే జీవితాన్ని అంకితం చేసిన వీరిని ఈ అవార్డులతో కేంద్ర సర్కారు గౌరవించింది. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, పారిశుద్ధ్యం, స్థిర అభివృద్ధి వంటి రంగాల్లో వీరు చేసిన సేవలకు ఈ గుర్తింపు లభించింది.
అన్సంగ్ హీరోస్ విభాగంలో మధ్యప్రదేశ్కు చెందిన భగవదాస్ రైక్వార్, జమ్మూకశ్మీర్కు చెందిన బ్రిజ్ లాల్ భట్, ఛత్తీస్గఢ్కు చెందిన బుద్రీ థాటి, ఒడిశాకు చెందిన చరణ్ హెంబ్రామ్కు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఉత్తరప్రదేశ్కు చెందిన చిరంజీ లాల్ యాదవ్, గుజరాత్కు చెందిన ధార్మిక్లాల్ చునీలాల్ పాండ్యాకు కూడా ఈ విభాగంలో పద్మశ్రీ అవార్డు లభించింది.
తమ సేవలు, త్యాగాలు ఎంతో గొప్పవైనప్పటికీ పెద్దగా ప్రచారం పొందకుండా, గుర్తింపు లేకుండా సమాజానికి మేలు చేసిన వ్యక్తులను Unsung heroes అంటారు. వీరిని గుర్తించి కేంద్ర సర్కారు ఈ పురస్కారంతో గౌరవించింది.
మరోవైపు, కర్ణాటకకు చెందిన అంకె గౌడను సాహిత్యం, విద్య రంగాల్లో పద్మశ్రీ-2026 అవార్డు వరించింది.
ఫుల్ లిస్ట్ ఇదే.. పీడీఎఫ్ ఓపెన్ చేయండి..