Paytm Jobs: ప్రముఖ ఆన్లైన్ లావాదేవీల సంస్థ పేటీఎం.. దేశవ్యాప్తంగా 20 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టింది. సంస్థకు సంబంధించి డిజిటల్ ఉపకరణాలపై వ్యాపారులకు అవగాహన కల్పించేందుకుగానూ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్లను నియమించాలని ప్లాన్ చేసింది. పైగా ఈ జాబ్స్ కోసం డిగ్రీలు, ఎంబీఏలు చేయాల్సిన అవసర్లేదు. ఉద్యోగులకు పది లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైతే సరిపోతుందని ప్రకటించింది.
గ్రాడ్యుయేట్లు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. వేతనంతో పాటు కమీషన్ కలుపుకుని నెలకు రూ.35 వేల వరకూ సంపాదించుకునే అవకాశం ఉందని పేటీఎం స్పష్టం చేసింది. కరోనా సంక్షోభంతో జాబ్స్ పోగొట్టుకున్న వారికి సదవకాశమని పేర్కొంది. బిజినెస్ ఉమెన్ ను కోపరేట్ చేసే దిశగా ఫిమేట్ ఎంప్లాయీస్ తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది.
ఈ ఎఫ్ఎస్ఈలు.. క్యూఆర్ కోడ్, పీఓఎస్ యంత్రాలు, సౌండ్ బాక్స్, వ్యాలెట్, యూపీఐ, పోస్ట్పెయిడ్, రుణాలు, ఇన్సూరెన్స్లు ఇలా పేటీఎంకు చెందిన అన్ని ప్రొడక్ట్లపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. టూ వీలర్ ఉండి సేల్స్ రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రియారిటీ ఉంటుందని సంస్థ వివరించింది. ఉద్యోగార్థులు ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. పేటీఎం జాబ్స్ కోసం క్లిక్ చేయండి..