Narendra Modi: బంగారం కొనకండి.. విదేశీ ప్రయాణాలకు బ్రేక్ వేయండి.. ప్రధాని మోదీ సంచలన పిలుపు

భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) దేశ ప్రజలకు 'స్వదేశీ' ప్రాముఖ్యతను వివరిస్తూ కీలక పిలుపునిచ్చారు.

Pm modi sco summit bishkek speech shun foreign trips golds swadeshi call

  • విదేశీ ప్రయాణాలకు బ్రేక్ వేయండి
  • బంగారం కొనుగోళ్లు తగ్గించుకోండి మోదీ
  • స్వదేశీకి ప్రాధాన్యమివ్వాలని పిలుపు

Narendra Modi: షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు కోసం బిష్కెక్‌ (కిర్గిజిస్తాన్) పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), దేశ ప్రజలకు ‘స్వదేశీ’ ప్రాముఖ్యతను వివరిస్తూ కీలక పిలుపునిచ్చారు. భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని, స్వయంసమృద్ధిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సరదా కోసమే చేసే విదేశీ విహారయాత్రలను పక్కన పెట్టాలని, అత్యవసరం అయితే తప్ప విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం మరియు అనవసరంగా బంగారం కొనుగోలు చేయడం వంటివి తగ్గించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Madras Regiment Incident: సికింద్రాబాద్ ఆర్మీ కాంపౌండ్‌లో దొంగతనం.. ఏకే-47 రైఫిళ్లు, పిస్టళ్లు అపహరణ

గ్లోబల్ సవాళ్లను అధిగమిస్తున్న భారత్: ‘జూఠ్ కీ గూంజ్’ పై మోదీ తీవ్ర వ్యాఖ్యలు:

ప్రపంచవ్యాప్తంగా రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, సరఫరా వ్యవస్థలకు అంతరాయాలు కలుగుతున్నప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘ఛత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ “దేశంలో కొందరు నిరాశలో కూరుకుపోయి ‘జూఠ్ కీ గూంజ్’ (అబద్ధాల హోరు) ప్రచారం చేస్తున్నారు” అని మండిపడ్డారు. ఈ రకమైన అసత్య ప్రచారాలను, సవాళ్లను ఛేదించుకుంటూనే దేశం 7.8% వృద్ధి సాధించిందని ఆయన ఉద్ఘాటించారు.

140 కోట్ల మంది ఐక్యత: స్వయంసమృద్ధి దిశగా అడుగులు:

దేశ యువత కన్న కలలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరైన విధానాలు, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతోందని మోదీ అన్నారు. 140 కోట్ల మంది భారత ప్రజల ఉమ్మడి శక్తిదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తోందని అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యేనాటికి రాబోయే తరాలకు పూర్తిస్థాయి ‘అభివృద్ధి చెందిన భారత్’ను కానుకగా ఇవ్వడమే మనందరి ప్రధాన లక్ష్యం కావాలని ఆయన ఆకాంక్షించారు.

HYDRAA Ranganath: హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా రంగనాథ్.. సింగిల్ జడ్జ్ తీర్పుపై సవాల్.. విచారణపై తీవ్ర ఉత్కంఠ

బిష్కెక్‌లో ఎస్‌సీఓ సమ్మిట్: అంతర్జాతీయ వేదికపై ప్రధాని:

ఇదిలా ఉండగా, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో కలిసి ప్రధాని మోదీ బిష్కెక్‌లోని ఎస్‌సీఓ (SCO) సదస్సులో పాల్గొంటున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తూనే, అంతర్గతంగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు పౌరులంతా స్వదేశీ వస్తువులనే ఆదరించాలని మోదీ పునరుద్ఘాటించారు.