PM Modi ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం(నవంబర్-4,2021) జమ్మూకశ్మీర్ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన 2014 నుంచి ప్రతి ఏటా దీపావళి పండుగను దేశ సరిహద్దుల్లో సైనికుల మధ్య జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది రాజౌరి జిల్లాలోని నౌషిరా సెక్టార్ లోని ఫార్వార్డ్ ఏరియాలోని జవాన్లతో మోదీ దీపావళిని జరుపుకోనున్నారని కేంద్రప్రభుత్వం తెలిపింది. మోదీ పర్యటన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల బలగాలు అప్రమత్తమయ్యాయి.
ఆ తర్వాత శుక్రవారం ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయాన్ని మోదీ సందర్శించనున్నారు. కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం మోదీ.. అక్కడ పునర్నిర్మించిన శ్రీ ఆదిశంకరాచార్య సమాధికి ప్రారంభోత్సవం తర్వాత ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
కాగా,గతేడాది రాజస్థాన్లోని జైసల్మేర్లో సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. సైనికుల మధ్యకు వచ్చినప్పుడు తనకు అసలైన దీపావళిని జరుపుకుంటున్నట్లు అనిపిస్తుందని ఆ సమయంలో మోదీ పేర్కొన్నారు. సైనికులు ఉత్సాహంగా ఉంటేనే దేశ ప్రజలు ఉత్సాహంగా ఉంటారని మోదీ అన్నారు. వారు సంతోషంగా ఉంటనే పండుగైనా, దేశమైనా అని అన్నారు. దేశాన్ని రక్షించే సైనికులను చూసి యావత్ భారతావని గర్వపడుతోందని ప్రధాని అన్నారు. ఆక్రమణదారులు, ఉగ్రవాదులను ఎదుర్కొనే ధైర్యం సైనికులను ఉందని చెప్పారు.
ALSO READ Door To Door Vaccine : ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వండి..అధికారులకు మోదీ సూచన