ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. అధికారంలోకి వచ్చేందుకు శక్తిమంతమైన నాయకుడిగా మోడీ తనను తాను చిత్రీకరించుకోవటమే.. భారత్కు ఇప్పుడు అతిపెద్ద బలహీనతగా మారిందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చేందుకు శక్తిమంతమైన నేతగా చిత్రీకరించుకున్న మోడీ .. తన 56 అంగుళాల ఛాతీ సిద్ధాంతాన్ని కాపాడుకోవాలని ఎద్దేవా చేశారు. తాము చెప్పినట్లు చేయని పక్షంలో మోడీ బలమైన నేత అన్న భావవను దెబ్బ తీస్తామని.. చైనా చెబుతోందని రాహుల్ వెల్లడించారు. దీనిపై ప్రధాని ఏ విధంగా స్పందిస్తారని రాహుల్ ప్రశ్నించారు.
భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్ పునరుద్ఘాటించారు. సరిహద్దు సమస్య ఒక్కటే చైనా వ్యూహం కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ చైనా భారత భూభాగంలో ఉండటం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.
ప్రపంచ ఆకృతిని మార్చాలనే లక్ష్యంగా చైనా దూకుడుగా ప్రవర్తిస్తోంది. అందుకు గ్వాదర్ నౌకాశ్రయం, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నిర్మాణాలే ఉదాహరణ. పాక్తో కలిసి చైనా.. కశ్మీర్లో ఏదో చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.. అందుకే ఇది కేవలం సరిహద్దు సమస్య మాత్రమే కాదు, ప్రధానిపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సృష్టించిన సమస్య. తద్వారా ఆయన కల్పించుకున్న 56 అంగుళాల ఛాతీ అనే సిద్ధాంతాన్ని దెబ్బతీయాలని చైనా భావిస్తోంది అని రాహుల్ గాంధీ అన్నారు. చైనా వ్యూహాత్మక ప్రణాళిక పేరిట ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు రాహుల్.
PM fabricated a fake strongman image to come to power. It was his biggest strength.
It is now India’s biggest weakness. pic.twitter.com/ifAplkFpVv
— Rahul Gandhi (@RahulGandhi) July 20, 2020