Maha-Karnataka: ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి.. మహా-కర్ణాటక వివాదంపై ఉద్ధవ్ డిమాండ్
రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతుండడంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం వేడెక్కింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరిగిన అనంతరం 1957లో ఈ వివాదం తలెత్తింది. మరాఠీ మాట్లాడే జనాభా గణనీయమైన సంఖ్యలో ఉన్నందున, మునుపటి బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెళగావి తమదే అంటూ మహారాష్ట్ర దావా వేసింది
- tony bekkal
- Published On : December 10, 2022 / 09:15 PM IST
PM should clarify his stand on Maha-Karnataka border row, says Uddhav
Maha-Karnataka: మహారాష్ట్ర-కర్ణాటక వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్ధవ్ వర్గం) అధినేత ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థను కూడా ఆయన సమర్థించారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం “న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి” దానిని తన బొటనవేలు కిందకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.
జాల్నా జిల్లాలోని సంత్ రాందాస్ కళాశాలలో 42వ మరాఠ్వాడా సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో థాకరే పాల్గొని ప్రసంగించారు. “నాగ్పూర్-ముంబై ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. మేము ఆయనకు స్వాగతం పలుకుతున్నాము. ఈ పర్యటనలో మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై తన వైఖరేంటో ప్రధాని స్పష్టం చేయాలి. ప్రధాని ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు రాష్ట్రాన్ని పీడిస్తున్న అనేక సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది” అని థాకరే అన్నారు. అలాగే మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలపై దావా వేస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైపై కూడా స్పందించాలని థాకరే డిమాండ్ చేశారు.
Karnataka: SC, ST లపై స్పెషల్ ఫోకస్.. బీజేపీకి కౌంటర్గా భారీ సభకు కాంగ్రెస్ ప్లాన్
రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతుండడంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం వేడెక్కింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరిగిన అనంతరం 1957లో ఈ వివాదం తలెత్తింది. మరాఠీ మాట్లాడే జనాభా గణనీయమైన సంఖ్యలో ఉన్నందున, మునుపటి బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెళగావి తమదే అంటూ మహారాష్ట్ర దావా వేసింది. ఇది ప్రస్తుతం కర్ణాటకలో భాగమైన 814 మరాఠీ మాట్లాడే గ్రామాలపై ప్రభావం పడుతోంది.
కొలీజియం వ్యవస్థపై వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్లను థాకరే విమర్శించారు. న్యాయమూర్తులను న్యాయమూర్తులు నియమించకపోతే వారిని ప్రధానమంత్రి నియమిస్తారా అంటూ ప్రశ్నించారు. కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి పరాయిదంటూ రిజిజు గత నెలలో కిరణ్ రిజిజు అన్నారు. ఇక ధన్ఖర్, రాజ్యసభలో తన తొలి ప్రసంగంలోనే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని రద్దు చేసిందని, అది మంచి ఉదాహరణగా పేర్కొన్నారని విమర్శించారు.
